ఏపీ కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 11న ఉదయం 11.31కు మంత్రులు ప్రమాణం చేస్తారు. కొత్త మంత్రుల చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఇందులో భాగంగా మంత్రులు ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయిగతంలో మంత్రులు ప్రమాణం చేసిన చోటే మళ్లీ ప్రమాణ స్వీకారం జరగనుంది. దానిలో భాగంగా వెలగపూడి సచివాలయం పక్కన ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
మరోవైపు తాజాగా జరిగిన కేబినెట్ భేటీ తర్వాత మంత్రుల నుంచి రాజీనామాలు స్వీకరించిన సీఎం జగన్.. వాటిని గవర్నర్ కు కాసేపట్లో పంపించనున్నారు.
వీటితో పాటు కొత్తగా ప్రమాణం చేసే మంత్రుల జాబితాలను కూడా రేపు మధ్యాహ్నానికి గవర్నర్ హరిచందన్ కు పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు.
గవర్నర్ ఆమోద ముద్ర పడ్డాక రేపు సాయంత్రం కొత్త మంత్రులకు సమాచారం పంపనున్నారు. ఆ తర్వాత జగన్ స్వయంగా మంత్రులు కాబోయే వారికి ఫోన్లు చేసి సమాచారం ఇవ్వబోతున్నారు.
కోడెల మృతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!