ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ నేత సుజనా చౌదరి మండిపడ్డారు. కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోవట్లేదని ధ్వజమెత్తారు. .’ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని 151 సీట్లతో గెలిపించారు కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలను, చట్టాలను లెక్కచేయకుండా పాలన చేస్తానంటే కుదరదు. ఇప్పటికైనా మీ పనితీరును సమీక్షించుకుని, ప్రజలకు సరైన పాలన అందించాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా చీమకుట్టినట్టయినా లేదు. చివరకు సుప్రీం కోర్టు తీర్పులను సైతం లెక్కచేయకుండా తామనుకున్నట్టుగా పరిపాలించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని దుయ్యబట్టారు.
ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని