telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెల మృతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

somireddy brother into ycp today

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ల మృతిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల మృతిపై సానుభూతి తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడెల తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని అన్నారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.కోడెల చనిపోయే వరకూ వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందని ఆరోపించారు. ఎవరు తప్పు చేసినా చట్టాలు, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు.

ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. వైసీపీ పాలనలో తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయని, అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రాజకీయదాడి అయినా జరిగిందా? అని ప్రశ్నించారు.టీడీపీకి చెందిన మరో నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాజకీయ వేధింపులకు కోడెల బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యానికి, అభివృద్ధికి మారుపేరు కోడెల అని పేర్కొన్నారు.

Related posts