ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ సఅమర్థత కారణంగా పలు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లి పోతున్నాయన్నారు. రిలయన్స్, అదానీ వంటి అగ్రగామి కంపెనీలు బై బై ఏపీ అంటూ ఒకదాని వెంట ఒకటి రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయని తెలిపారు.
కంపెనీలు వెళ్లిపోవడంతో ఉపాధి కోల్పోయి ఉద్యోగులు రోడ్డున పడుతారని అన్నారు. ఆ ప్రముఖ పారిశ్రామిక సంస్థల వెంటపడి వాటిని ఏపీకి తీసుకురావడానికి ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డామని పేర్కొన్నారు. ఇప్పుడా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంటే బాధగా ఉందని లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి: కేశినేని నాని