telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని కాల్చి చంపిన నక్సల్స్

maoist naksals

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్న నెపంతో ఇద్దరు గిరిజనులను కాల్చి చంపారు. విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలం నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చింతపల్లి మండలం వీరవరానికి నిన్న రాత్రి మావోలు చేరుకున్నారు. అనంతరం ఊరిలోని సత్తిబాబు, భాస్కరావు, లింగరాజును ఇళ్లకు వెళ్లి వారిని బయటకు రావాల్సిందిగా కోరారు.

వారు బయటకు రాగానే బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సత్తిబాబు, భాస్కరరావులు పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. తాము ఇన్ఫార్మర్లు కాదని ఇద్దరు గిరిజనులు మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఇద్దరిని అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం మరో గిరిజనుడు లింగరాజును తీవ్రంగా కొట్టి వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక దళాలతో ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.

Related posts