telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రివర్గం కూర్పుపై స‌ర్వ‌త్ర ఉత్కంఠ..ఆ జాబితాలో నేను ఉన్నా

మంత్రివర్గం కూర్పుపై స‌ర్వ‌త్ర ఉత్కంఠ నెల‌కొంది. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయ‌నున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా కూర్పును రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నది.

2019 కేబినెట్‌లో కూర్పుకు పూర్తి భిన్నంగా తాజా కూర్పు ఉండబోతుందని ఇప్పటికే వైసీపీ వర్గాలు లీకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త కేబినెట్‌లో కొందరూ పాత మంత్రులు కొనసాగే అవకాశం ఉంటుందని సాక్షాత్తూ సీఎం జగన్ ప్రకటించారు.

అయితే, ఆశావహులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.. ఈ విషయంపై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… మంత్రివర్గంలో నాకు స్థానం ఉంటుందా లేదా అన్నది నాకు తెలియదు… కానీ, ఆశావహుల జాబితాలో నేను ఉన్నాను అన్నారు.. మంత్రి పదవులు ఇచ్చే జాబితాలో నాపేరు ఉందా లేదా అన్నది సీఎం జగన్ ఇష్టమేనన్న ఆయన.. 150 మంది ఎమ్మెల్యేలకూ మంత్రి కావాలనే ఆశ ఉంటుందన్నారు.

రేపటి వరకూ ఈ ఆశ అందరి ఎమ్మెల్యేలకు ఉంటుంది.. కొత్త జాబితా వచ్చాక సీఎం నిర్ణయాన్ని అందరూ ఏకీభవిస్తారని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.

.

Related posts