telugu navyamedia
Tourism వార్తలు సామాజిక

మాతా వైష్ణో దేవి ఆలయానికి జూన్ 10 న ప్రారంభo కానున్న భారత్ గౌరవ్ రైలుకు లభించిన మంచి స్పందన .

ఈ రైలు ఉత్తర భారతదేశంలోని మాతా వైష్ణో దేవి ఆలయం, హరిద్వార్ మరియు
రిషికేశ్ వంటి ముఖ్యమైన మరియు ప్రసిద్ధ యాత్రా స్థలాలను కలుపుతుంది.

ఇది ఐ ఆర్ సీ టి సీ ద్వారా నిర్వహించబడుతుంది. ఇప్పటికే 50% సీట్లు బుక్
చేయబడ్డాయి

భారత్ రైల్వే ద్వారా ప్రవేశ పెట్టబడిన 'భారత్ గౌరవ్ ' రైళ్ల విధానము దక్షిణ మధ్య
రైల్వేలో భారీ విజయాన్ని సాధించింది . ఐ ఆర్ సీ టి సీ ఇటీవల నిర్వహించిన కాశీ మరియు
పరిసర ప్రాంతాలకు ఐదు ట్రిప్పుల్లో 100% ఆక్యుపెన్సీ నమోదు చేయబడింది. రైలు
ప్రయాణీకుల ఉత్సాహభరితమైన ప్రతిస్పందన నేపథ్యంలో, ఇండియన్ రైల్వేస్
క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ ఆర్ సీ టి సీ ) ఉత్తర భారతదేశంలోని ఇతర
ప్రసిద్ధ మరియు ముఖ్యమైన యాత్రా స్థలాలను కవర్ చేసే భాగంగా భారత్ గౌరవ్
రైళ్లలో కొత్త టూరిస్ట్ సర్క్యూట్‌ను ప్లాన్ చేసింది.


దీనిలో భాగంగా, ఐ ఆర్ సీ టి సీ "మాతా వైష్ణో దేవి, హరిద్వార్ మరియు రిషికేశ్ "
అనే కొత్త పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమతుంది . ఈ రైలు దేశంలోని ఉత్తర
ప్రాంతాలలోని ముఖ్యమైన యాత్రికులు మరియు చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తు
తెలంగాణ మరియు మహారాష్ట్రలోని ఏడు ముఖ్యమైన స్టేషన్లలో ఎక్కేందుకు
/దిగేందుకు సౌకర్యాన్ని అందిస్తుంది . ఉత్తర భారతదేశానికి తీర్థయాత్రల పట్ల
ప్రజల ఆసక్తిని తెలియజేస్తూ, మాతా వైష్ణో దేవి ఆలయం వైపు కొత్త టూరిస్ట్
రైలును ప్రకటించిన కొద్ది రోజుల్లోనే 50% కంటే ఎక్కువ సీట్లు బుక్
చేయబడ్డాయి.

ప్యాకేజీ వివరాల్లోకి వెళినట్లయితే, ఈ “ హరిద్వార్ మరియు రిషికేశ్‌తో
మాతా వైష్ణోదేవి ” టూరిస్ట్ సర్క్యూట్ రైలు సికింద్రాబాద్లో మొదలై ,
తెలంగాణలోని కాజీపేట , పెద్దపల్లి , రామగుండం మరియు సిర్పూర్‌ కాగజ్ నగర్ల తో పాటు
మహారాష్ట్రలోని బల్హర్షా , వార్ధా మరియు నాగ్‌పూర్ స్టేషన్ లలో ఎక్కేo దుకు /
దిగేoదుకు ఐ ఆర్ సీ టి సీ సౌకర్యాన్ని అందిస్తుంది . ఈ రైలు కత్రా , ఆగ్రా, మథుర ,
బృందావన్ , కత్రా , హరిద్వార్ మరియు రిషికేశ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను కవర్
చేస్తుంది . కత్రా స్టేషన్ నుండి వైష్ణో దేవి ఆలయానికి పోనీ / డోలీ లేదా
హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్
చేసుకోవాలి. ఐ ఆర్ సీ టి సీ ఈ అంశంలో పర్యాటకులకు మార్గనిర్దేశం చేస్తుంది
మరియు దర్శనం తర్వాత సౌకర్యవంతంగా తిరిగి రావడానికి ప్రయాణంలో తగినంత
సమయం కేటాయించబడుతుంది.

మొత్తం ట్రిప్ 8 రాత్రులు / 9 రోజుల వ్యవధిలో పూర్తిచేయబడుతుంది. ఈ
ప్యాకేజీలో ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణా రెండింటితో
సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు టూర్ ఎస్కార్ట్‌లు , భద్రత ,
పబ్లిక్ అనౌన్స్‌మెంట్, ప్రయాణ బీమా సౌకర్యం మొదలైనవి లభ్యమౌతాయి .
మరిన్ని వివరాల కోసం ఎవరైనా ఐ ఆర్ సీ టి సీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు:

సికింద్రాబాద్ కార్యాలయం ఫోన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. : 9701360701,
8287932228, 9110712752
హరిద్వార్ & రిషికేష్‌తో మాతా వైష్ణోదేవి – భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
పర్యటన
ప్రణాళిక సికింద్రాబాద్ – ఆగ్రా- మథుర – బృందావన్ – కత్రా ( వైష్ణోదేవి

) – హరిద్వార్ – రిషికేశ్ – సికింద్రాబాద్

పర్యటన తేదీ 10.06.2023 12:00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి
వ్యవధి 10.06.2023 నుండి 18.06.2023 వరకు 8 రాత్రులు/9 రోజులు
ఎక్కేందుకు /దిగేందుకు
సౌకర్యంగల
స్టేషన్లు

సికింద్రాబాద్ , కాజీపేట్ , పెద్దపల్లి , రామగుండం , సిర్పూర్‌
కాగజ్ నగర్, బల్హర్షా , వార్ధా & నాగ్‌పూర్

ఒక్కొక్కరికి ధర
(జీ ఎస్ టి తో
సహా)

ఎకానమీ కేటగిరీ (స్లీపర్ ): రూ. 15435/-
ప్రామాణిక వర్గం (3ఏ. సీ ): రూ. 24735/-
కంఫర్ట్ కేటగిరీ (2 ఏ. సీ): రూ. 32480/-

Related posts