తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు రామగుండంలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలిస్తున్నారు. ప్లాంట్ పనుల పురోగతిని సీఎం కేసీర్కు అధికారులు వివరిస్తున్నారు. ప్లాంట్ నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఎన్టీపీసీ, జెన్కో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.
సమీక్ష అనంతరం ఈరోజు రాత్రి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్లో కేసీఆర్ బస చేస్తారు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని కేసీఆర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్, మేడిగడ్డ బరాజ్ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు.