telugu navyamedia
రాజకీయ వార్తలు

సైనికుల త్యాగాలు మరవలేం..మన్‌కీ బాత్‌లో మోదీ

modi on jammu and kashmir rule

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలను ఉద్దేశించి మన్‌కీ బాత్‌లో ప్రసంగిస్తున్నారు. 21 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్‌ యుద్ధం గురించి ఆయన మాట్లాడుతూ సైనికుల త్యాగాలు మరవలేమని అన్నారు. దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు ధన్యవాదాలు తెలియజేశారు. 21 ఏళ్ల క్రితం ఇదే రోజు మన సైన్యం కార్గిల్ యుద్ధంలోవిజయం సాధించదని చెప్పారు. భారత్‌ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోందన్నారు. అంతర్గత సంఘర్షణల నుంచి దృష్టి మరల్చేందుకు పాక్ దురాలోచన చేసిందని మోదీ విమర్శించారు.

మన దేశానికి హాని కలిగించే విషయాలను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో కొందరు నకిలీ పోస్టులు చేస్తుంటారన్నారు. వాటిని చాలా మంది షేర్ చేస్తుంటారు. యుద్ధాలు సరిహద్దుల్లో మాత్రమే జరగవని, దేశంలోని వివిధ రంగాల్లోనూ జరుగుతుంటాయని తెలిపారు. ప్రతి పౌరుడు అందులో తన పాత్రను నిర్ణయించుకోవాలని అన్నారు. ఫేక్ న్యూస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు.

Related posts