telugu navyamedia
వార్తలు సామాజిక

నేటి నుంచి నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ రద్దు

Attack Railway TTI in Danapur express

కాజీపేట నుంచి వయా రామగుండం మీదుగా ప్రతిరోజు నడిచే నాగ్‌పూర్‌ (అజ్ని)ప్యాసింజర్‌ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ – బల్లార్ష సెక్షన్‌లో జరుగుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నాగ్‌పూర్‌ (అజ్ని)ప్యాసింజర్‌ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్‌-అజ్ని- కాజీపేట జంక్షన్‌ల మధ్య ప్రతి రోజు రాకపోకలు సాగించే నాగ్‌పూర్‌ (అజ్ని)ప్యాసింజర్‌ రైలులో ప్రయాణించే వారు ఈ అంతరాయాన్ని గమనించాలని అధికారులు కోరారు. తిరిగి ఏప్రిల్‌ 2నుంచి ఈ రైలు యథావిధిగా నడుస్తుందని వారు చెప్పారు.

Related posts