telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

Crime

బెదిరింపులకు భయపడి ఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మంగళగిరికి చెందిన పవన్ కుమార్, చిత్తూరు జిల్లాకు చెందిన శైలజలకు టిక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతం గత నెల 3న తిరుపతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.

ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త కాపురాన్ని ప్రారంభించారు. అదే సమయంలో శైలజ తల్లిదండ్రులు ఎంటరై… పవన్ ను వదిలేసి రావాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి శైలజ ఫోన్ వాడటాన్ని కూడా మానేసింది. అనంతరం పవన్ కు శైలజ బంధువులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు.

బెదిరింపులబెదిరింపులు రావడంతో శైలజ, పవన్ ఇద్దరూ భయపడిపోయారు. కలిసి బతకలేని పరిస్థితి నెలకొందనే బాధలో చనిపోవడానికి సిద్ధమయ్యారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts