telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు పీఏపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత

New couples attack SR Nagar

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ పై వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై మనోహర్ రూ. 12 లక్షల లోన్ తీసుకొని, స్వాహా చేసేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

మరోవైపు కుప్పం టౌన్ బ్యాంకులో రూ. 1.9 కోట్ల స్కాం జరిగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొందరు ప్రముఖులు లోన్లు తీసుకుని స్వాహా చేశారని చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

Related posts