ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ పై వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై మనోహర్ రూ. 12 లక్షల లోన్ తీసుకొని, స్వాహా చేసేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
మరోవైపు కుప్పం టౌన్ బ్యాంకులో రూ. 1.9 కోట్ల స్కాం జరిగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొందరు ప్రముఖులు లోన్లు తీసుకుని స్వాహా చేశారని చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.