జాన్వీ కపూర్ ధడక్ అనే సినిమాతో హీరోయిన్ గా వెండితెర కు పరిచమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే చక్కటి అందం , అభినయం కనపరిచి అందరిని హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం జాన్వీ ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే ఓ సినిమా లో నటించబోతుంది. ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గుంజన్ పాత్రలో జాన్వీ నటిస్తుంది.
సోషల్ మీడియా లో మాత్రం ఈ అమ్మడు నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు..ప్రస్తుతం మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా రెడ్ డిజైనర్ డ్రస్ లో జాన్వీ కపూర్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యోగ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఈవెంట్ లో ఈ రెండ్ హాట్ డ్రస్ లో పాల్గొంది. అక్కడ రెడ్ డ్రస్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.