దేశంలో కొరోనాతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కూడా నెమ్మదిగా వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా ఇండియాలో కూడా థర్డ్ వేవ్ మొదలైపోయింది.
సామాన్యులు , ప్రజా ప్రతినిధులు, సినీ తారలు కరోనా బారిన పడడం ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ పలువురు స్టార్లు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి కరోనా బారిన పడింది. కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్ నటి మీనా తన అభిమానులను పలకరించారు. మీనా మాత్రమే కాదు ఆమె ఫ్యామిలీ మొత్తం కోవిడ్ బారిన పడ్డారు.
‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో ఎక్కువ రోజులు చోటు ఇవ్వను. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. మీనా చివరగా రజినీకాంత్ హీరోగా నటించిన అన్నాత్తే మూవీలో, వెంకటేష్ దృశ్యం 2 చిత్రాల్లో నటించారు.
మా ఎన్నికలపై దర్శకేంద్రుడు స్పందన….