సినిమా ప్రపంచంలో హీరోయిన్ల నటన కంటే గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం గ్లామర్ షోను పక్కన పెట్టి కేవలం నటనకే ప్రాధాన్యతనిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. అలాంటి వారిలో మనం ఇంతవరకూ నిత్యామీనన్ ను చూశాం. ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే జాబితాలో చేరిపోయింది. ప్రేమమ్, ఫిదా చిత్రాలతో ప్రేక్షకులను ఫిదా చేసి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది సాయి పల్లవి. గ్లామరస్ పాత్రలకు, కమర్షియల్ సినిమాలకు దూరంగా మంచి నటన, అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్తో దక్షిణాదిన ఎంతోమంది అభిమానులను సంపాదించకుంది. తమిళ, మలయాళ, తెలుగు సినీ పరిశ్రమల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రానాతో కలిసి `విరాటపర్వం`లోనూ, శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న `లవ్స్టోరీ`లోనూ నటిస్తోంది. తాజాగా సాయి పల్లవికి అరుదైన ఘనత దక్కింది. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా `ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30` జాబితాను విడుదల చేసింది. 30 సంవత్సరాలలోపు తమ తమ రంగాల్లో విజయాలను సాధించిన 30 వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు దక్కించుకుంది. దీంతో సాయిపల్లవి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
.@Sai_Pallavi92 in ‘Forbes India 30 Under 30’ list of Young Achievers under the age of 30 pic.twitter.com/e4gRRXbZoO
— BARaju (@baraju_SuperHit) February 7, 2020
నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే : హరీష్ శంకర్