telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. మహిళపై గుర్తు తెలియని దుండ‌గులు యాసిడ్ దాడి

తెలంగాణ‌లోని  ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు మండలంలో దారుణం జరిగింది.. ఓ మహిళపై గుర్తుతెలియని దుండ‌గులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. లక్కారం పరిధిలోని కేబీనగర్‌లో ఈ ఘ‌ట‌న‌ జరిగింది. మహిళపై యాసిడ్ పోసి దుండగులు పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు.

కాగా బాధిత మహిళను స్థానికులు హుటాహుటిన ఉట్నూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉట్నూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మహిళపై యాసిడ్ దాడి ఎందుకు జరిగింది అన్న విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts