జార్ఖండ్లోని దంకా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ మహిళపై అమానుషంగా వ్యవహరించారు. ఆమెపై దాడి చేసి దుస్తులు చింపేసి..నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన జార్ఖండ్లోని డుమ్కా జిల్లాలో రాణీశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రణీశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన వివాహిత కొన్ని రోజుల క్రితం పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయింది. వివాహితుబు భార్య వీళ్లను పట్టుకొని దాడి చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఆమెకు పాటు కొంతమంది వ్యక్తులు జత కలిసి బాధిత మహిళను తీవ్రంగా కొట్టి ఆమె మెడ చుట్టూ చెప్పుల దండ వేశారు. అంతటితో ఆగకుండా నగ్నంగా ఊరేగించారు. బాధితురాలి దగ్గర నుంచి రూ. 25000 లాక్కున్నారు. ఈ ఘటన కు సంబంధించి 12 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో పాటు ఆయన భార్య సహా 12 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. . ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భావితరాల సంక్షేమం కోసం జగన్ కృషి: మంత్రి బొత్స