భావితరాల సంక్షేమం కోసం ఏపీ జగన్ కృషి చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం పెద్దపీట వేశారని, మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా బురదజల్లేందుకు ఎల్లోమీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
చంద్రబాబు ఉచ్చులో ప్రజలు పడొద్దని మంత్రి సూచించారు. అమరావతి పేరుతో టీడీపీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. లక్ష కోట్లతో అమరావతిని మాత్రమే ఎందుకు అభివృద్ధి చేయాలి? వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకూడదా? అని ప్రశ్నించారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు.
నారా వారి పాలన కాదు సారా వారి పాలన: ఎమ్మెల్యే రోజా