telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ సబ్జెక్టు లేకుండా మాట్లాడుతున్నారు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ లో మాట్లాడుతున్న తీరు పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. గురువారం సాయంత్రం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు అహంభావం తప్ప సబ్జెక్టు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.సీఎం జగన్‌పై శుక్రవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వడ్డీ రాయితీ ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. సభను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు.

కనీసం తమ వాదనను విన్పించే అవకాశం లేకుండా సభను వాయిదా వేశారని చెప్పారు. ఈ విషయమై తాను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెబుతారా, రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.సున్న వడ్డీ పథకం పాత పథకమేనని చెప్పారు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి  హయాంలో జీవోను విడుదల చేసినట్టు  గుర్తు చేశారు.

Related posts