తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలపై, ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశ హత్య, నిందితుల ఎన్కౌంటర్తో పాటు, పలు అంశాలపై మోదీ చర్చించారు. దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రజా స్పందనపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. దీంతో పాటుగా తెలంగాణలో ఏం జరుగుతోందని ఆయన ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నామని, కష్టపడి పనిచేయండని ఎంపీలతో ప్రధాని అన్నారు. అందరినీ కలుపుకెళ్లాలని సూచించారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని ఎంపీ సంజయ్, ప్రధానితో చెప్పారు. వాళ్లు అలాగే ఉంటారని మోదీ వ్యాఖ్యానించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో కుటుంబ పార్టీలు కనుమరుగవుతున్నాయని ఎంపీలతో ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. మోదీకి సమ్మక్క-సారక్క ప్రసాదం ఆదిలాబాద్ ఎంపీ బాపూరావు ఇచ్చారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారక్క గద్దె విశిష్టత గురించి మోదీకి ఎంపీ గరికపాటి రాంమోహన్ రావు వివరించారు.