తిరుమల బస్ టికెట్ల వెనుక “జెరూసలెం” వివరాలు ప్రచురించడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఈ వ్యవహారం పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఇప్పటికే ఖండిచారు. తాజాగా ఈ విషయం పై స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమత ప్రచారానికి సంబంధించిన ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే దుర్మార్గపు చర్యలని స్వరూపానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇది కుట్రగా భావిస్తున్నామని, దీనికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. హిందూ పుణ్యక్షేత్రాల పరిసరాల్లో అన్యమత ప్రచారాన్ని నిరోధించేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లో ఓ జీవో తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పుడా జీవోను జగన్ బయటికి తీయాల్సిన అవసరం ఉందని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే చర్యలను ఉపేక్షించడం ప్రభుత్వానికి తగదని విశాఖ శారదా పీఠాధిపతి హితవు పలికారు.