telugu navyamedia
క్రీడలు వార్తలు

మూడు జట్లను కూడా ఫీల్డ్​లోకి దించగల సత్తా భారత్ కు ఉంది…

భారత్ త్వరలో రెండు జట్లను బరిలోకి దించుతోంది. ఈ ఘనత అంతా టీమిండియాదే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. మరొక టీమ్ శ్రీలంక టూర్​కు వెళ్లనుంది. ఏక కాలంలో రెండు జట్లతో రెండు సిరీస్​ల్లో పాల్గొననుంది. అయితే భారత్ రెండు కాదు మూడు జట్లను కూడా ఫీల్డ్​లోకి దించగల సత్తా టీమిండియాకు ఉంది. ప్రారంభ స్థాయి నుంచి దృఢమైన ఆటగాళ్లు ఉండటమే ఇందుకు కారణం అని పాకిస్థాన్ మాజీ వికెట్‌కీపర్ కమ్రాన్ అక్మల్ అన్నారు. యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ మంచి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయన గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది క్రికెటర్లను తయారు చేశాడు. కోచ్​ రవిశాస్త్రి కూడా జట్టుకు అద్భుతంగా సేవలందిస్తున్నాడు. మాజీ కెప్టెన్ ధోనీ నాయకత్వాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ అందిపుచ్చుకున్నాడు. విరాట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడు. అతడు గాయపడితే కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. ఇలా చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. ఒకవేళ ఇండియా-సీ టీమ్​ను శ్రీలంక పర్యటనకు పంపినా.. అది గెలుస్తుంది” అని అక్మల్ చెప్పుకొచ్చాడు.

Related posts