telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్ కు మోదీ అభినందనలు

modi aslo campaign on cast base

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో దూసుకుపోతుండటంతో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇందుకు తిరుపతి వేదికగా మారనుంది. ఈ  తరుణంలో ఏపీలో  వైఎస్సార్సీపీ గెలుపుపై ప్రధాని మోదీ స్పందించారు. 

తన ట్విట్టర్ ఖాతాలో వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రియమైన వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ ఐదేళ్ల పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ట్వీట్ చేశారు.

Related posts