అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్ పంపిణీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు నుంచి పది ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. కేసీ కెనాల్ ద్వారా రెండు పంటలకు నీళ్లందిస్తామని జనసేనాని హామీ ఇచ్చారు. అలాగే 60 ఏళ్లు నిండిన రైతులకు రూ.5 వేలు పెన్షన్, ఎకరానికి రూ.8 వేలు సాగు సహాయం అందిస్తామన్నారు. సౌభాగ్య రాయలసీమ కింద రూ. 50 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కళాకారుల కోసం రాయలసీమ కల్చరల్ అకాడమీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విధి ఎవరినీ విడిచిపెట్టదు..అందరి సరదా తీర్చేస్తుంది- రోజా