పూజా హెగ్డే “ఒక లైలా కోసం” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ ఇమేజ్ అందుకుంది. పూజా హెగ్డే ఇటీవల “మహర్షి” చిత్రంతో అభిమానులని అలరించగా, ఆమె తాజా సినిమా “గద్దలకొండ గణేష్” చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా “అల.. వైకుంఠపురములో”, “హౌజ్ఫుల్-4”, ప్రభాస్ రాధాకృష్ణ చిత్రాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ అమ్మడు అఖిల్ నాల్గొవ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం. ఈ ముద్దుగుమ్మ సామాజిక అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తాజాగా మహారాష్ట్రంలో చెట్ల నరికివేత దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ముంబైలోని ఆరే కాలనీలో అర్థరాత్రి చెట్లను నరికివేశారు. ముంబై మెట్రో.. అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 3 వేల భారీ వృక్షాలను నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద్దంటూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో చాలామంది చెట్ల నరికివేతపై మహా సర్కార్తో పాటు మోదీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పూజా హెగ్డే కూడా తన సోషల్ మీడియాలో ఈ అంశంపై రియాక్ట్ అయ్యింది. “నా మనసు ఎంతగానో గాయపడింది. ఇది చాలా దారుణం. మన జీవనాధారం చెట్లని మనం ఎప్పుడు గ్రహిస్తాం ? మెట్రో, పార్కింగ్ స్థలాలు చెట్ల కన్నా ముఖ్యమైనవి కాదు” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను కోడ్ చేస్తూ ఆమె ట్విట్టర్లో పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
My heart is CRYING! This is outrageous.. @narendramodi @Dev_Fadnavis what’s going on?! When are we gonna realise that our SURVIVAL depends on trees?! No metro, no parking lot is more important…Horrible 😭😭💔 https://t.co/NWH4KRJtox
— Pooja Hegde (@hegdepooja) 5 October 2019