telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు తన వైఖరి వెల్లడించాలి: మంత్రి అనిల్

minister anil kumar

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటి పారుదల ప్రాజెక్టు విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 తెలంగాణ సర్కారును అసహనానికి గురిచేస్తోంది.ఈ నేపథ్యంలో, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు పోతిరెడ్డిపాడుపై తన వైఖరి వెల్లడించలేదని మంత్రి అనిల్ఆ రోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడున్నా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తన వైఖరేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు ఈ అంశంలో మౌనంగా ఉండడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.

Related posts