తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉండగా తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనని రాజా సింగ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాజా సింగ్పై నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. స్పీకర్కు, ప్రొటెం స్పీకర్కు తేడా తెలవని రాజా సింగ్ నీ అజ్జానంతో జనాలను తప్పుతోవ పట్టించకని అని ఆడుకున్నారు.
అవును.. నువ్వు అసెంబ్లీకి రాకు రాజాసింగ్. నువ్వు రావొద్దు కూడా. అసెంబ్లీని నిర్మించింది ముస్లిం రాజే. గోషామహల్ను కూడా నువ్వు వదిలేయ్.. గోషామహల్ను ముస్లింలే కట్టారు. హైదరాబాద్ను ముస్లిమే నిర్మించాడు. హైదరాబాద్ నుంచి కూడా వెళ్లిపో. గంగా జమునా (గంగా-యమునా) నదుల్లా ఇక్కడ అందరూ కలిసుంటారు. అది నీకు అర్థం కాదు కానీ.. రాజస్థాన్ వెళ్లిపో. పోయి అక్కడ ఏదన్నా పని చూసుకో. హైదరాబాద్ సంస్కృతి నీకు అర్థం కాదు.. అంటూ రాజాసింగ్కు చివాట్లు పెట్టారు. రాజకీయాల కోసం నగరవాసుల మధ్య అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే నీ పప్పులుడకవని హెచ్చరించారు.