telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు…

వరుసగా రెండో రోజు ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు.. గురువారం రోజు ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.70కి చేరింది. డీజిల్‌పై కూడా 25 పైసలు వడ్డించడంతో.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.74.88కు పెరిందిగి.. ఇక, తాజా పెంపుతో జైపూర్‌లో కొత్త రికార్డు సృష్టించాయి పెట్రోల్ ధరలు.. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.54కి, డీజిల్‌ రూ.84.53కి పెరిగింది.. పెట్రోల్‌ ధర భారత దేశంలోనే అత్యధిక ధర పలికింది జైపూర్‌లోనే.. మరోవైపు.. డీజిల్‌ ధరలు రూ.81 మార్క్‌ను కూడా దాటేశాయి.. దేశంలోనే అత్యధికంగా డీజిల్‌ ధర హైదరాబాద్‌లో రూ. 81.72కు చేరింది. మొత్తంగా పెట్రోల్‌ ధరలు.. హైదరాబాద్‌లో రూ.88.11, కోల్‌కతాలో రూ.86.15, ముంబైలో 91.32, చెన్నైలో రూ.87.40, బెంగళూరులో రూ.87.56, భువనేశ్వర్‌ రూ.85.36, పాట్నాలో రూ.86.73గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర కోల్‌కతాలో రూ.78.47, ముంబైలో రూ.81.60, చెన్నైలో రూ.80.19, బెంగళూరు రూ.79.70, హైదరాబాద్‌లో రూ.81.72, పాట్నాలో రూ.80.46కు పరుగులు పెట్టాయి. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతుండగా.. మరోవైపు నిత్యావసర వస్తువలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. చూడాలి మరి ఇంకా ఈ ధరలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది.

Related posts