డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడే భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అందరూ అంచనా వేసినట్టుగానే భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా శుబ్మాన్ గిల్, రోహిత్ శర్మలు ఆడడం ఖాయం అయింది. ఆపై చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తారు. ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా, స్పెసలిస్ట్ స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్ ఆడనున్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలకు చోటు దక్కింది. దీంతో సీనియర్ పేసర్ ఇషాంత్ బదులుగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లపై అడగొట్టిన మహ్మద్ సిరాజ్ను తుది జట్టులోకి తీసుకుంటారన్న వార్తలకు చెక్ పడింది. అలానే ఆరో స్థానం ఆశించిన హనుమ విహారికి నిరాశ తప్పలేదు. హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్లు బెంచ్కు పరిమితమయ్యారు
భారత జట్టు:
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ.