telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పరీక్షా కేంద్రాలను పెంచండి: కోదండరామ్

Kodandaram

రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలను పెంచాలని టీజేఎస్ అధినేత కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి అతి తక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారని కోదండరామ్ విమర్శించారు. ఓవైపు వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్న ప్రభుత్వ తీరు మాత్రం దారుణంగా ఉందన్నారు. కరోనా విషయంలో హైకోర్టు సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ అధినేతల దృష్టికి తెచ్చే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. అందుకే ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం వస్తోందని అన్నారు హైకోర్టు తీర్పును అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం సమస్యను మరింత సంక్లిష్టం చేయడమే అవుతుందని చెప్పారు.

Related posts