ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు ఇవాళ మధ్యాహ్నం భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేష్ విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్కు వెళ్లారు. అయితే.. చిరు బృందం బస చేస్తున్న గెస్ట్ హౌస్ ముందు రాజధాని మహిళలు ఆందోళనకు దిగారు. ‘మూడు రాజధానులు వద్దు రాజధానే ముద్దు’ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి అభివృద్ధే భవిష్యత్తుకు ఉషోదయం అని రాజధాని మహిళలు చెబుతున్నారు. రాజధాని మహిళలు రావడంతో అప్రమత్తమైన పోలీసులు గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. కాగా ఇవాళ ఉదయం టాలీవుడ్ హీరోలపై కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
previous post
ఫస్ట్ నీ సినిమాల్లో నువ్వు ఎక్స్పోజింగ్ తగ్గించు… మంచు లక్ష్మిపై జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు