telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్‌ 2020 ఫైనల్‌ : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ కాపిటల్స్‌..

ఐపీఎల్ 2020 లో ఇవాళ ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ కాపిటల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్సు అయ్యార్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే గత కొన్ని మ్యాచ్ ల నుండి టాస్ చాలా కీలకంగా మారింది. మొన్న హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీ కాపిటల్స్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి..భారీ స్కోర్‌ చేసింది. ఫైనల్‌ లోనూ అదే ఆటతీరు ప్రదర్శించాలని ఢిల్లీ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. మరి ఛేదనలో ముంబై విజయం సాధించి మరోసారి ఛాంపియన్స్‌గా నిలుస్తాందా..లేక ఢిల్లీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందా అనేది చూడాలి.
ఇక జట్ల వివరాలు ఇలా ఉన్నాయి…
ఢిల్లీ : శ్రేయస్సు అయ్యర్‌ (కెప్టెన్‌), స్టోయినోస్‌, ధవన్‌, రహానే, హెట్‌మెయిర్‌, పంత్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, రబాడా, ప్రవీణ్‌ దూబే, అన్‌రిచ్‌ నార్జే

ముంబై : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, పోలార్డ్‌, హార్ధిక్‌ పాండ్యా, క్రునాల్‌ పాండ్యా, నాథాన్‌ కల్టర్‌ నేల్‌, జయంత్‌ యాదవ్‌, ట్రెంట్‌ బోల్ట్‌, బుమ్రా

Related posts