telugu navyamedia
క్రీడలు వార్తలు

రెండో మ్యాచ్ ముందు నాకు ఏబీడి ఒక్కే మాట చెప్పాడు : కోహ్లీ

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భరత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. తన ఇన్నింగ్స్ లో షాట్ ఏది ఆడినా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అయితే ఇలా బ్యాటింగ్‌ చేయడానికి తన వెనుక ఓ వ్యక్తి ఉన్నారని కోహ్లీ తెలిపాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… మా బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో కేవలం 34 పరుగులు మాత్రమే ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయం. ఎందుకంటే.. ఇంగ్లండ్‌లో హిట్టర్స్ ఎక్కువగా ఉన్నారు. సుందర్ బాగా బౌలింగ్ చేశాడు. భువీ, ఠాకూర్, చాహల్ అద్భుత బంతులు వేశారు. మొత్తానికి బౌలింగ్ మరియు బ్యాటింగ్‌తో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇది జట్టు విజయం’ అని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు నేను ఏబీ డివిలియర్స్‌తో స్పెషల్‌ చాట్‌ చేశాను. బంతిని మాత్రమే చూసి ఆడమని చెప్పాడు. నేను అదే చేశాను. చివరకు హాఫ్ సెంచరీ బాధాను’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. అయితే ఈ విజయంతో 5 మ్యాచ్ ల ఈ సిరీస్ ను భారత్ 1-1 తో సమం చేసింది.

Related posts