telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అక్కడ మందు షాపుల ముందు మహిళలు…

మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. దాంతో చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధిస్తున్నారు. అయితే తాజాగా తమిళనాడులో ఈనెల 10 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే.  లాక్ డౌన్ కారణంగా నిత్యావసర, అత్యవసర సర్వీసులు మినహా అన్ని మూతపడిపోతాయి.  రెండు వారాలపాటు కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  చెన్నైలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. మే 10 వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు లిక్కర్ షాపుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.  ప్రతి లిక్కర్ షాపు ముందు కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్నారు మందుబాబులు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో లిక్కర్ షాపుల వద్ద క్యూలో నిలబడటం విశేషం. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts