telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోటి వృక్షార్చ‌న విజయవంతం చేయాలి.. తెలంగాణ మంత్రుల పిలుపు

ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 17వ తేదీన ఉద‌యం 10-00 గంట‌ల నుంచి 11-00 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం ఒక గంట వ్య‌వ‌ధిలో కోటి మొక్క‌లు నాటే కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లో శ‌నివారం నిర్వ‌హించిన మీడియా కాన్ఫ‌రెన్స్ లో కోటి వృక్షార్చ‌న పోస్ట‌ర్ ని మంత్రులు ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నేత క‌న్నెబోయిన రాజ‌య్య యాద‌వ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్ర‌తినిధులు రాఘ‌వ్, కిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts