ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి చెందారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన నర్సింగ్ యాదవ్… ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. 1963 మే 15న హైదరాబాద్లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించి కామెడీ విలన్గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ్ బాషల్లోనూ ఆయన నటించారు. రజనీకాంత్ నటించిన బాషాలోనూ మంచి కేరెక్టర్ చేశారు. విజయనిర్మల దర్శ కత్వం వహించిన హేమాహేమీలుతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నర్సింగ్ యాదవ్. క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన కేరక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది. ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నటించారు.
previous post
next post