విదేశీ టెలికాం సంస్థల సర్వీసులను వినియోగించడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. విదేశీ టెలి సంస్థ సర్వీసులను వాడరాదు అని ఆ ఆదేశాల్లో అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశంపై ఆయన సంతకం చేశారు. అయితే ఆ ఆదేశాల్లో విదేశీ కంపెనీ ఏదన్న అంశాన్ని వెల్లడించలేదు.
కానీ చైనాకు చెందిన హువావే కంపెనీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మా కంపెనీ సేవలను నిలిపివేయడం వల్ల అమెరికా కస్టమర్లే నష్టపోతారు అని హువావే సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. హువావే ఉత్పత్తులతో చైనా నిఘాకు పాల్పడుతోందని అనేక దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది. హువావే కంపెనీకి చెందిన 5జీ సేవలను తిరస్కరించాలని అమెరికా తన మిత్రదేశాలను కోరుతున్నట్టు తెలుస్తోంది.