ఉత్తరప్రదేశ్లోని నాలుగు రైల్వే స్టేషన్ల పేర్లు ఇకపై మారనున్నాయి. అలహాబాద్ రైల్వే జంక్షన్ పేరును ప్రయాగ్రాజ్ రైల్వే జంక్షన్గా, అలహాబాద్ సిటీ రైల్వే స్టేషన్ పేరును ప్రయాగ్రాజ్ రాంబాగ్ రైల్వే స్టేషన్గా మారనుంది.
అలహాబాద్ ఛివ్కీ రైల్వే స్టేషన్ పేరును ప్రయాగ్రాజ్ ఛివ్కీ రైల్వే స్టేషన్గా, ప్రయాగ్రాజ్ ఘాట్ పేరును ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్గా పేరు మారుస్తున్నట్టు రైల్వే శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాగ్రాజ్ పురాతన ప్రాభవానికి గుర్తుగానే స్టేషన్ల పేర్లను మార్చినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరిస్థానంలో ఉన్నాయి: రేవంత్ రెడ్డి