telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సుధీర్ బాబు

Sudheer-Babu

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అన్ని రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ స్వచ్ఛందంగా మొక్కలు నాటుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన హీరో సుధీర్ బాబు బుధవారం తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ కు సుధీర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఓ మొక్కను నాటి, ఆ సినిమా పేరు పెడుతానని తెలిపారు. ఈ క్రమంలోనే ‘వి’ సినిమాకు గుర్తుగా బుధవారం తన నివాసంలో మొక్కలు నాటానని ఆయన వెల్లడించారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, హీరోయిన్లు నివేదా థామస్, అదితీరావు హైదరీలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు సుధీర్ బాబు.

Related posts