మహారాష్ట్రలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేసింది. కేవలం ఐటీఐ ద్వారానే ఉద్యోగం సంపాదించుకునే వారికి ఇది సదవకాశం. అయితే ఆరంభంలో వీరిని అప్రెంటీస్ గా తీసుకుంటారు. ఆ తర్వాత వీలును బట్టి సంస్థ అవసరాన్ని బట్టి ఉద్యోగం కొనసాగిస్తారు. ఒక వేళ ఉద్యోగం కొనసాగించకపోయినా సరే.. ఆ అనుభవం ఐటీఐ వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం సంపాదించుకునేందుకు వీలు పడుతుంది.
వివరాల్లోకి వెళ్తే .. మొత్తం 80 పోస్టులు ఉన్నాయి.
ట్రేడ్ అప్రెంటిషిప్ మొత్తం ఖాళీలు : 80.
ఫిట్టర్, టర్నర్, ఎలక్టీషియన్, వెల్డర్, డీజిల్ మెకానిక్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హత : సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి 21, 2020 చివరి తేదీ.
మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ : //npcil.nic.in/ ను సందర్శించ వచ్చు.