telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దళిత వర్గానికి మంత్రి పదవి ఇవ్వని దుస్థితి: ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy-Venkata-Redd

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12 శాతమున్న దళిత వర్గానికి మంత్రి పదవి ఇవ్వని దుస్థితి నెలకొందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిసారిగా ఉద్యమం చేసిన వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక పద్మావతి, సైదిరెడ్డి మధ్య పోటీ కాదని , నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరు అని కోమటిరెడ్డి అభివర్ణించారు. సొంత పార్టీ శాసనసభ్యురాలిని ప్రగతి భవన్‌కు రానియ్యని పరిస్థితి రాష్టంలో నెలకొన్నదని విమర్శించారు. మూడు లక్షల తొంభైవేల మంది ఉద్యోగాల కోసం రోడ్లు మీద తిరుగుతున్నారని అన్నారు. సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు ఉమ్మడి చెక్ పవర్ పేరిట లేని పంచాయితీని కేసీఆర్‌ పెట్టారని దుయ్యబట్టారు. హుజూర్‌ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Related posts