గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా అందిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తుస్తున్నట్లు వర్సిటీ పీఆర్ఓ ఆశీశ్ జెకాబ్ ఓ ప్రకటనలో తెలిపారు. సంవత్సర కాలం పాటు కొనసాగే ఈ కోర్సులలో బిజినెస్ మేనేజ్మెంట్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, సైబర్ లాస్, ఫోరెన్సిక్ సైన్స్, కెమికల్ అనాలిస్, హ్యూమన్ రైట్స్, లైబ్రరీ అటోమేషన్ నెట్వర్కింగ్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఎనర్జీ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. యూజీసీ/ఏఐసీటీఈ/డీఈసీ జాయింట్ కమిటీ ద్వారా గుర్తింపు పొందిన కోర్సులను అందజేస్తున్నామని, రెగ్యులర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సైతం దూరవిద్య కోర్సులలో చేరవచ్చని పేర్కొన్నారు.
previous post
next post