telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

త‌మిళ‌నాడు లో రేప‌టి నుంచి మద్యం దుకాణాలు ఓపెన్‌

liquor maals

లాక్‌డౌన్‌ కారణంగా చెన్నైలో మూతబడిన వైన్ షాపులు రేపు తెరుచుకోనున్నాయి. క‌రోనా కేసులు కొద్దిగా త‌గ్గ‌డంతో రేప‌టి నుంచి మ‌ద్యం విక్ర‌యాలు ప్రారంభించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. షాపులు ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు తెర‌చి ఉంటాయ‌ని, 500 టోకెన్లు మాత్ర‌మే ఇస్తామ‌ని తెలిపింది. త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ సంస్థ‌ టాస్మాక్ ఆధ్వ‌ర్యంలో మద్యం షాపులు న‌డుస్తున్నాయి. ‌

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేసింది. అయితే నిబంధ‌న‌ల స‌డ‌లింపుతో మే 5న చెన్నై మిన‌హా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అమ్మ‌కాలు తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గడంతో ఈనెల 18 నుంచిదుకాణాల్లో మద్యం విక్రయాలు ప్రారంభమవుతాయని టాస్మాక్‌ సంస్థ ప్ర‌క‌టించింది.

Related posts