telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంటినేషనల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు… కరణ్ జోహార్ పై కంగనా ఫైర్

Kangana

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌పై మరోసారి మండిపడ్డారు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినీ కెరీర్‌ను కరణ్ నాశనం చేసి అతడి ఆత్మహత్యకు పరోక్షంగా కారణమయ్యాడని, కాబట్టి ఆయన పద్మ శ్రీ పురస్కారానికి అనర్హుడని.. ఆ అవార్డును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కంగనా సోషల్‌ మీడియా వేదికగా కోరారు. దీనిపై కంగనా ట్వీట్‌ చేస్తూ.. “కరణ్‌ జోహార్‌ పద్మశ్రీ అవార్టును తిరిగి తీసుకోవాలని నేను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అతను నన్ను బహిరంగంగా ఓ అంతర్జాతీయ వేదికపై పరిశ్రమను వదిలి వెళ్ళమని బెదిరించాడు. అంతేగాక యంగ్‌ హీరో సుశాంత్ కెరీర్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నాడు. ఉరి చిత్రం వివాదం సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మన భారత సైన్యాన్ని అవమానించే విధంగా యాంటినేషనల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు” అని కంగనా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Related posts