శ్రీలంకలో ఈస్టర్ సండే నాడు జరిగిన ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో అక్కడ అత్యవసర పరిస్థితి విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అక్కడ ఉగ్రముప్పు పొంచి ఉండటంతో అత్యయిక పరిస్థితిని మరో నెల రోజులపాటు పొడిగిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధికారికంగా ప్రకటించారు. ప్రజా భద్రత చట్టం ప్రకారం వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో నెలరోజుల పాటు అక్కడ అత్యయిక పరిస్థితి కొనసాగుతుంది.