telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీరుపై హిందూ దేవుళ్ల బొమ్మలా?… బీజేపీ నేతకు వైసీపీ శ్రేణుల కౌంటర్

Beer

ఏపీలో హిందూ ఆలయాల మీద దాడులపై రాజకీయ దుమారం రేగుతున్న తరుణంలో బీజేపీ కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బీరుపై హిందూ దేవుళ్ల బొమ్మలు ఏంటని ప్రశ్నిస్తూ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ కు కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. “తెలంగాణ, ఆంధ్రలో వీటిని తక్షణం నిషేధించి కంపెనీలపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఇతర మతాలకు సంబంధించి ఇలా చేయగలరా? ఇప్పటికైనా హిందూ సమాజం కళ్లు తెరవాలి” అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. తన ట్వీట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎంవోకు, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం ట్యాగ్ చేశారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు లాజిక్‌తో కొట్టిపారేశాయి. ఆ కంపెనీ బీర్లు అసలు ఏపీ, తెలంగాణలో లేవని, అయినా ఆ బీర్లపై ఉంది హిందూ దేవుళ్ల బొమ్మలు కాదని చెబుతున్నారు. ఆ బీర్లపై ఉంది భారతీయ సాంస్కృతిక కళా శిల్పాలని, అవి దేవుళ్ల బొమ్మలు కాదని రిప్లై ఇస్తున్నారు.

Related posts