ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పంజాబ్ లో ఉగ్రదాడికి ముష్కరమూకల ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. అన్ని జోన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల వద్ద ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని వెల్లడించింది. అధికారులతో సమీక్ష జరిపిన సీఎం అమరీందర్ సింగ్, పాక్ ఉగ్ర మూకల కుట్రలను భగ్నం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.