ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పోలీసులు చేసే ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నేడు తీర్పు వెలువరించింది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత వెంటనే ఆ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది.
దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీంలో సవాల్ చేశాయి. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ తీర్పు వెలువరించింది. ఎన్కౌంటర్లపై గతంలో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.