తెలుగులో ఎన్నో మంచి సినిమాల్లో చేసినా అగ్ర హీరోయిన్గా ఎదగలేకపోయింది రాశీ ఖన్నా . ఇప్పుడు ఈ అమ్మడు కొత్తగా గేర్ మార్చి వెబ్ సిరీస్లో చేయనుందట. ఇటీవల ఓ వెబ్ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఊహలు గుసగుస లాడే సినిమాతో అందరిమందుకు వచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ తరువాత జిల్, జై లవకుశ వంటి కథలను ఎంచుకొని అలరించింది. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన తొలిప్రేమతో సూపర్ హిట్ అందుకుంది. ఇలా వరుసగా మంచి మంచి కథలతో ఆకట్టుకుంటున్న స్టార్ హీరోయిన్ స్థాయి మాత్రం దక్కలేదు. దాంతో మళ్లీ తన ఇంటికి వెళ్లనుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శక్తంలో తెరకెక్కనున్న సరికొత్త వెబ్ సిరీస్లో రాశీ చేయనుంది. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేయనున్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ జాన్అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో చిత్రరంగంలోకి రాశీ అరంగేట్రం చేసింది. ఆ తరువాత టాలీవుడ్లో సెటిల్ అయ్యింది. ఇప్పటికీ మద్రాస్ కేఫ్ వచ్చి ఏడు సంవత్సరాలు. దాంతో ఏడు సంవత్సారాల తరువాత రాశీ మళ్లీ సొంత గూటికి చేరనుంది.
previous post
next post