telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్న జగన్.. ఎందుకంటే..?

ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ తిరుపతిలో పర్యటించనున్నట్లు ఇంతకముందు వైసీపీ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే అనూహ్యంగా ఆయన సభ రద్దు చేస్తున్నట్లు గా ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు ఆయన లేఖ రాశారు. ఈనెల 14వ తేదీన తిరుపతి బహిరంగ సభకు నేను వస్తానని ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్న సంగతి మీకు తెలిసిందే అని ఆయన పేర్కొన్నారు.. ఆ సభకు రావడం ద్వారా మీ ఆత్మీయ అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని భావించానని అయితే తాజా కరోనా హెల్త్ బులిటెన్ చూసిన తర్వాత ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. ”నేను వ్యక్తిగతంగా వచ్చి ప్రచారం చేసి మిమ్మల్ని ఓటు అడగకపోయినా మన అందరి ప్రభుత్వం మీ పిల్లల కోసం మన అవ్వా తాతల కోసం అక్కాచెల్లెళ్ల కోసం మన గ్రామాలు పట్టణాలు కోసం ఏం చేసింది అన్నది మీ అందరికీ వివరిస్తూ మీకు కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశాను అని ఆయన పేర్కొన్నారు. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి నిండు మనసుతో గుండె నిండా ప్రేమతో ఓటు రూపంలో ఇస్తారని మనందరి అభ్యర్థి నా సోదరుడు గురుమూర్తి ని గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్న కు ఇచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువగా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి అందిస్తారని ఆశిస్తున్నానని” లేఖలో పేర్కొన్నారు జగన్.

Related posts